ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. ఆమె గురువారం ఉదయం దిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరినట్లు ఆసుపత్రివర్గాలు వెల్లడించాయి. ఉదర సంబంధిత సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు తెలిసింది.

శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్‌ గంగారాం ఆసుపత్రి బోర్డ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఛైర్మన్‌ అజయ్‌ స్వరూప్‌ వెల్లడించారు. గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు డాక్టర్‌ సమీరన్‌ నందీ ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లోనూ అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ గంగారామ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *