War-2: ఎన్టీర్-హృతిక్‌తో స్టెప్పులేయనున్న స్టార్ హీరోయిన్?

నందమూరి స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వార్ 2(WAR-2)’. ఈ సినిమాతో యంగ్‌టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ(Ayaan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్(Yash Raj Spy Universe)లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటూ తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అదేంటంటే..

హృతిక్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ రోల్

ఎన్టీఆర్-హృతిక్ రోష‌న్‌ మల్టీస్టారర్‌(multistarrer)గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ వార్-2(War-2)పై అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి న్యూస్ రివీల్ అయినా సోషల్ మీడియా(Social media)లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌(special song)‌కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్( Shraddha Kapoor) ఆ స్పెషల్ సాంగ్‌‌లో NTR, హృతిక్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హృతిక్ పాత్రకు దీటుగా NTR రోల్ ఉంటుందట. ఈ మధ్యనే ముంబైలో ఈ ఇద్దరిపై ఫైట్ సీన్లు చిత్రీకరించారు.

 స్త్రీ-2 మూవీ హిట్‌తో శ్రద్ధాకి ఆఫర్?

ఇదిలా ఉండగా శ్రద్ధా కపూర్ ఇటీవల స్త్రీ-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.800 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 2018లో శ్రద్థాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు కాంబినేషన్‌లో వచ్చిన ‘ స్త్రీ ’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. హారర్‌ కామెడీగా ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న బాక్సాఫీసు ముందుకొచ్చి భారీ సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే శద్ధాని వార్‌-2 కోసం తీసుకున్నట్లు B-టౌన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *