
హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), నటుడు సుమంత్(Sumanth) కలిసి దిగిన ఫొటో కొద్ది రోజులుగా సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ ఫొటో(Photo)లో వీరిద్దరూ చాలా చనువుగా ఉన్నట్లు కనిపిస్తుండడంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని రూమర్లు(Rumors) వినిపిస్తున్నాయి. అయితే ‘సీతారామం’ సినిమాకు గాను సుమంత్, మృణాల్ ఠాకూర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీలోని హీరోయిన్గా ఆమె నటించగా.. సుమంత్ నెగిటివ్ రోల్(Negative Role)లో కనిపించారు.
ఎవరేం మాట్లాడుకున్నా పట్టించుకోను..
అయితే అప్పటి వారి పరిచయం ప్రేమ(Love)గా మారిందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. వాటిపై ఇప్పటి వరకూ మృణాల్, సుమంత్ రెస్పాండ్ కాలేదు. దీంతో తాజాగా ఆ విషయంపై ఆయన స్పందించారు. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘అనగనగా(Anaganaga’ ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడారు. తాను SMకు దూరంగా ఉంటానని తెలిపారు. అందుకే అందులో తన గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోనని చెప్పారు. ఏ ఫొటో గురించి అడుగుతున్నారో కూడా తెలియదని అన్నారు.
కీర్తిరెడ్డితో సుమంత్ విడాకులు
అయితే గతంలో సుమంత్.. హీరోయిన్ కీర్తి రెడ్డి(Kirthi Reddy)ని పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్(Single)గానే ఉంటున్నారు. ఆ నేపథ్యంలోనే రెండో పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అయితే తాను ప్రస్తుతం సోలోగానే హ్యాపీగా బతుకుతున్నానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు సుమంత్. కాగా సుమంత్ నటించిన అనగనగా మూవీ ఈ నెల 15న విడుదల కానుంది.