మన ఈనాడు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉప్పల్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన భంగపడిన సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు. ఆయన్ను మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో నిలిపేందుకు కారు నేతలు సిద్దం అయ్యారని సమాచారం.
సీఎం రేవంత్రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్లమెంట్ ఇంఛార్జీగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్రెడ్డి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది
ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉండటంతో మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయించేందుకు ఇప్పటికే గులాబీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పార్టమెంట్ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను పార్టీ ప్రకటించబోతున్నట్లు సమాచారం