BRS:మల్కాజిగిరి పార్లమెంట్​ బరిలో సింగిరెడ్డి..

మన ఈనాడు: రాబోయే పార్లమెంట్​ ఎన్నికల్లో ఉప్పల్​ కాంగ్రెస్​ టిక్కెట్​ ఆశించిన భంగపడిన సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి బీఆర్​ఎస్​ గూటికి చేరారు. ఆయన్ను మల్కాజిగిరి పార్లమెంట్​ బరిలో నిలిపేందుకు కారు నేతలు సిద్దం అయ్యారని సమాచారం.

సీఎం రేవంత్​రెడ్డిపై అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదునైన విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. గతంలో ఇక్కడ బీఆర్​ఎస్​ పార్లమెంట్​ ఇంఛార్జీగా వ్యవహరించిన మర్రి రాజశేఖర్​రెడ్డి మల్కాజిగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో మల్కాజిగిరి పార్లమెంట్​ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీఆర్​ఎస్​ అధిష్టానం నిర్ణయం తీసుకుంది

ఉప్పల్​ నియోజకవర్గానికి చెందిన సింగిరెడ్డి సోమశేఖర్​రెడ్డి ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా ఉండటంతో మల్కాజిగిరి పార్లమెంట్​ నుంచి పోటీ చేయించేందుకు ఇప్పటికే గులాబీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రెండు, మూడు రోజుల్లో పార్టమెంట్​ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను పార్టీ ప్రకటించబోతున్నట్లు సమాచారం

Share post:

లేటెస్ట్