విద్యార్థులకు బిగ్ అలర్ట్.. త్వరలోనే ‘పది’ ఫలితాలు

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. త్వరలోనే పదో తరగతి పరీక్షల ఫలితాలు (Telangana SSC Results 2025) విడుదల కానున్నాయి. ఇవాళ (ఏప్రిల్ 29వ తేదీ 2025) రిజల్ట్స్ రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది. ఇప్పటికే ఫలితాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని.. విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్‌టర్నల్ మార్కులు, మొత్తం మార్కులతో SSC పాస్ సర్టిఫికెట్ జారీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.

ఫలితాలపై ఇవాళే క్లారిటీ 

ఈ నేపథ్యంలో త్వరలోనే పదో తరగతి ఫలితాలు (TG 10th Results) విడుదల కానున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఫలితాలు రేపే విడుదల చేస్తారా.. మరే రోజైన రిలీజ్ చేస్తారా అనేది ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Related Posts

Hyderabad Metro: పెరిగిన హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠా ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 17 నుంచి అమలు కానున్నట్లు…

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై (Bellamkonda Srinivas) కేసు నమోదైంది. రాంగ్ రూట్‌లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీస్తో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు బుక్ అయ్యింది. ఈనెల 13న జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *