TG Budget 2025: ఆరోగ్యశ్రీ పరిధి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Session) కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(FM Minister, Deputy CM Bhatti Vikramarka) మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వాని(TG Govt)కి జోడు గుర్రాలను అన్నారు. అంబేడ్కర్ సూచించిన నైతిక విలువలను పాటిస్తూ ప్రజాపాలన సాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 2025-26కి గాను తెలంగాణ రాష్ట్ర మొత్తం రూ. 3.04 లక్షల కోట్లుతో బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. మొత్తం 72 పేజీలతో భట్టి తన ప్రసంగాన్ని కొనసాగించారు. బడ్జెట్‌లోని కీలక అంశాలు ఇలా..

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి రూ. 11,600 కోట్లు

రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతోపాటు హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఆరోగ్య శ్రీ(Aarogyasri) పరిధి రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నాట్లు చెప్పారు. కొత్తగా 1,835 వైద్య చికిత్సలు ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నామని, దీంతో 90 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే వైద్య కళాశాలలకు భారీగా నిధులు కేటాయింపుతోపాటు 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి రూ. 11,600 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

Aarogyasri: ఆరోగ్యశ్రీ పథకంలో 65 కొత్త జబ్బులకు చికిత్స.. ప్రస్తుతం ఉన్న  చికిత్సలకు ప్యాకేజ్ పెంపు - Telugu News | Telangana: Treatment of 65 new  diseases under Aarogyasri scheme ...

రైతులకు రూ. 20, 616 కోట్ల రుణమాఫీ

రైతులకు రూ. 20, 616 కోట్లు రుణ మాఫీ(Runamafi) చేశామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేలు, రైతు భరోసా(Rythu Bharosa)కు రూ. 18000 కోట్ల బడ్జెట్.. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ అందించామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచామన్నారు. పశు సంవర్ధక శాఖకు రూ. 1,647 కోట్లు, వ్యవసాయ మార్కెట్లకు రూ.181 కోట్లతో ఆధునిక సదుపాయలు అందిస్తామని చెప్పారు.

Raitu RunaMafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే.. | Second  phase of farmer loan relief in Telangana Suchi

రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6000 కోట్లు

ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్.. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింపునకు కృషి చేస్తున్నామని, ఇప్పటి వరకు 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశామన్నారు. రాజీవ్ యువ వికాస పథకానికి రూ. 6000 కోట్లు కేటాయించినట్లు భట్టి తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *