
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్(Telangana Budget)ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) శాసనసభలో ఇవాళ ప్రవేశపెట్టారు. 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను సభకు సమర్పిస్తున్నట్లు తెలిపారు. తమను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని వివరించారు.
శాఖల వారీగా కేటాయింపులివే
- 2025-26 రాష్ట్ర బడ్జెట్ రూ.3,04,965 కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ.2,26,982 కోట్లు
- మూలధన వ్యయం – రూ.36,504 కోట్లు
- వ్యవసాయశాఖ – రూ.24,439 కోట్లు
- పశుసంవర్ధకం – రూ.1,674 కోట్లు
- పౌరసరఫరాలశాఖ – రూ.5,734 కోట్లు
- విద్యా రంగం – రూ.23,108 కోట్లు
- కార్మికశాఖ – రూ.900 కోట్లు
- పంచాయతీరాజ్ శాఖ – రూ.31,605 కోట్లు
- మహిళా శిశుసంక్షేమశాఖ – రూ.2,862 కోట్లు
- ఎస్సీ సంక్షేమం – రూ.40,232 కోట్లు
- ఎస్టీ సంక్షేమం – రూ.17,169 కోట్లు
- బీసీ సంక్షేమం – రూ.11,405 కోట్లు
- చేనేత రంగం – రూ.371 కోట్లు
- మైనార్టీ సంక్షేమం – రూ.3,591 కోట్లు
- పరిశ్రమలు – రూ.3,527 కోట్లు
- ఐటీ రంగం – రూ.774 కోట్లు
- విద్యుత్ రంగం – రూ.21,221 కోట్లు
- వైద్య రంగం – రూ.12,393 కోట్లు
- పురపాలక రంగం – రూ.17,677 కోట్లు
- నీటిపారుదల శాఖ – రూ.23,373 కోట్లు
- రహదారులు, భవనాలశాఖ – రూ.5,907 కోట్లు
- పర్యాటక రంగం – రూ.775 కోట్లు
- క్రీడలు – రూ.465 కోట్లు
- అటవీ, పర్యావరణం – రూ.1,023 కోట్లు
- దేవాదాయశాఖ – రూ.190 కోట్లు
- హోంశాఖ – రూ.10,188 కోట్లు
- ఆరు గ్యారంటీలు – రూ.56,084 కోట్లు
- రైతు భరోసా – రూ.18 వేల కోట్లు
- చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు
- ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు
- మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు
- గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
- సన్నాలకు బోనస్ – రూ.1,800 కోట్లు
- రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు
- గ్యాస్ సిలిండర్ రాయితీ – రూ.723 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు
- విద్యుత్ రాయితీ – రూ.11,500 కోట్లు
- రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు
- ఎస్డీఎఫ్ , సీడీపీ నిధులు రూ.3,300 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రూ.2,900 కోట్లు
- విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల – రూ.500 కోట్లు
- ఫ్యూచర్ సిటీ అభివృద్ధి – రూ.100 కోట్లు
- ఇందిరా గిరి జల వికాసం – రూ.600 కోట్లు
- నగరాభివృద్ధి – రూ.వెయ్యి కోట్లు
- పర్యాటక ప్రాజెక్టులు – రూ.721 కోట్లు
- గ్రామాల్లో వంద శాతం సౌర విద్యుత్ – రూ.1,500 కోట్లు
- గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం – రూ.వెయ్యి కోట్లు
- డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు – రూ.1,511 కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ – రూ.3,683 కోట్లు
- ఉపకారవేతనాలు – రూ.4,452 కోట్లు
- బియ్యం రాయితీ – రూ.3 వేల కోట్లు
- రైతు బీమా – రూ.1,589 కోట్లు