నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Sri Lakshminarasimhaswamy Temple) కొత్త హంగులతో అత్యంత శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయంలో మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవాలు(Maha Kumbhabhisheka Preservation Mahostavalu) అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి(Devastana Swarna Vimana Gopuram) ఇవాళ (ఫిబ్రవరి 23) మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు.

Image

సీఎం రేవంత్ షెడ్యూల్ ఇలా..

ఈమేరకు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్(CM Schedule) ఫిక్స్ అయింది. ఉదయం 11 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో యాదగిరి గుట్టకు వస్తారు. 11.54కి మూలా నక్షత్రం, వృషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేస్తారు. ఈ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో సీఎంతోపాటూ MPలు, మంత్రులు, MLAలు, పండితులు పాల్గొంటారు. ఈ సందర్భంగా.. కొండపై 25 వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం KCRను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.

Yadagirigutta priests invite KCR for Maha Kumbhabhishekam

దేశంలోనే అత్యంత ఎత్తయిన గోపురం

కాగా దేశంలోనే అత్యంత ఎత్తయిన గోపురం ఇదే కావడం విశేషం. 2024లో స్వర్ణ తాపడం(Gold Panning) పనులను ప్రారంభించగా.. ఈనెల 18న తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి. అయితే ఈ బిగింపు పనులకు ఆయన మొత్తం ఖర్చు రూ.5.10 కోట్లు. ఇక రాగి రేకులకు మొత్తం రూ.12 లక్షలు ఖర్చు కాగా, సుమారు ఈ స్వర్ణ తాపడం పనులకు రూ.70 కోట్ల వరకు ఖర్చయినట్టుగా అంచనా. అయితే ఈ స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తైన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరి ఎక్కడా లేదు. దీనికి దాదాపు 68 కిలోల బంగారం(Gold) వినియోగించినట్లు సమాచారం. కాగా విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు కాగా గోపురం వైశాల్యం 10759 చదరపు అడుగులు.

Yadagirigutta Temple Nalgonda: Timings, Entry Fee, History

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *