మన ఈనాడు:
ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ ముగ్గురు నాయకులపై ఉన్న అసంతృప్తితోనే కాంగ్రెస్ పార్టీకి ఊహించని విజయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.ప్రత్యర్థులను ఎదుర్కొనే గులాబీ బాస్ బక్కపలచని నాయకత్వంలో ఉన్న సత్తానే..ఉప్పల్ కాంగ్రెస్ అభ్యర్థి అంతకంటే ఎక్కువ సత్తా చూపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడిన ఇద్దరు కీలక నేతలు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు పలికారు. గులాబీలోనూ ముగ్గురు నేతలు ఎమ్మెల్యే రేసులో ఉన్నా ఫలితం దక్కలేదు. పైకి మద్దతు ఇస్తున్నా..అసంతృప్తి మాత్రం అలాగే ఉన్నట్లు తెలుస్తుంది.కాషాయం మాజీ ఎమ్మెల్యే గతంలో నేను చేసిన అభివృద్ధే అని చెబుతున్న అందులోనే అరడజను మంత్రి టిక్కెట్ ఆశించారు.
గ్రేటర్ హైదరాబాద్లో కారు జోరు మీద ఉందనే ప్రచారం జరుగుతుంది. ఉప్పల్ నియోజకవర్గం మాత్రం రోజురోజుకూ హీట్ ఎక్కుతుంది. లక్ష మెజార్టీతో గెలుస్తామని ప్రచారం చేసుకుంటున్న గులాబీ అభ్యర్థికి నాలుగు గ్రూపల నేతలు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సహకరిస్తారనే బెంగ పట్టుకుంది.
RRR సినిమాను తలపించేలా ఉప్పల్లో BBB ఫీవర్ పట్టుకుంది. బేతి, బొంతు, బండారి ఈ ముగ్గురు అనుచరులు పైకి చేతులు కలిపి..ప్రచారం చేసినా..వెనక ‘మాత్రం’ చేతి గుర్తుకు కలిసొచ్చేలా ఉన్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈముగ్గురు నేతలు పట్ల అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం.
ఉప్పల్ ప్రాంత ప్రజలు కార్పొరేటర్ అవకాశం ఇవ్వడంతో పనితీరు చూపించానని కాంగ్రెస్ అభ్యర్థి మందముల అంటున్నారు. మరోసారి MLAగా అవకాశం వచ్చింది..మరోసారి దీవించండి ఉప్పల్ అభివృద్ధి రాష్ర్టానికి ఆదర్శంగా నిలిపేలా చేస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇక్కడ ఉండే సెటిలర్ ఓటర్స్ ఎక్కువ. బీజేపీ లేదా కాంగ్రెస్ ఓట్లు పడే అవకాశం ఉంది. గులాబీ సొంతపార్టీ నేతలే అసంతృప్త క్యాడర్ హస్తం వైపు చూస్తున్నారు.