
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Telangana Intermediate Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చ్ 5 నుంచి 25 వరకు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇప్పటికే ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తయ్యాయని, రెండోసారి వెరిఫికేషన్(Verification) కూడా పూర్తి చేసి మార్కుల కంప్యూటరీకరణ చేపట్టినట్లు ఇంటర్మీడియట్ బోర్డు(Intermediate Board) తెలిపింది.
అధికారిక వెబ్సైట్లో..
కాగా విద్యార్థులు తమ రిజల్ట్స్(Results)ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in.లో చెక్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది. ఫలితాలు ప్రకటించిన వెంటనే విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్(Hall Ticket Number), పుట్టిన తేదీ ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చంది.