Six Guarantees: ఆరు గ్యారెంటీలపై అప్డేట్..CM కీలక సమాచారం

మన ఈనాడు:ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు.

Telangana Congress: తెలంగాణ రాష్ట్ర పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో చెప్పిన ఆరు గ్యారెంటీల అమలుపై అప్డేట్ ఇచ్చారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 28నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో ఆరు గ్యారెంటీల అమలుకు అప్లికేషన్లు, ఇతర గ్రీవెన్స్ను అడ్రస్ చేస్తామన్నారు

కాంగ్రెస్ పీఏసీ సమావేశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ టికెట్ కేటాయింపు, పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం వంటి విషయాలపై ఆయన కామెంట్స్ చేశారు. ఈ రోజు( సమావేశం జరిగిన రోజు నుంచే) అర్హుల ఎంపిక ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు అతి త్వరలో ప్రభుత్వం మార్గదర్శ కాలు విడుదల చేస్తుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. త్వరలోనే నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల ఎంపిక జరుగుతుందన్నారు. నాగ్ పూర్ లో ఈనెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలి పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పై అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఏఐసీసీ సభ్యులు సంపత్ కుమార్ మాట్లాడుతూ.. ఎంపీ టికెట్లు పీసీసీ ఎమ్మెల్సీలన్నీ అధిష్టానం పరిధిలో ఉన్నాయన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమల్లోకి తెస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *