24గంటలు నాడీ పట్టాల్సిందే..మంత్రి పొంగులేటి

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వంలో రోగులకు 24గంటల పాటు వైద్యసేవలు అందాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు విస్తరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు దవాఖాలకు ఆదరణ పెరిగేలా ఉండాలని తెలిపారు.

ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. రూ. 20 లక్షల వ్యయంతో తీర్థాల గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖాన, రూ. 20 లక్షల నిధులతో ఆరెకోడు తండా గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ నూతన భవనం, రూ. 20 లక్షల వ్యయంతో గుదిమళ్ళ గ్రామ పంచాయతీలో నిర్మించిన పల్లె దవాఖాన నూతన భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు.

వైద్యాధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండాలని, కావాల్సిన వసతులు కల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రజలను కాపాడుకునే బాధ్యత ఉందని ఆయన అన్నారు. అభయహస్తం కింద 6 గ్యారంటీలు వంద రోజుల్లో ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ క్రింద వైద్య ఖర్చు రూ. 10 లక్షలకు పరిమితి పెంపు అమలు చేశామన్నారు.

Related Posts

Parenting Advice: మీరూ మీ పిల్లలపై ఇలాగే ప్రవర్తిస్తున్నా? జాగ్రత్త!

Mana Enadu: ఏ తల్లిదండ్రులైనా పిల్లలన్నాక ముద్దుచేస్తారు. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తారు. ఒకవిధంగా చెప్పాలంటే మీ పిల్లలపై మీరు చూపించే ప్రేమాభిమానములు ఎంతో విలువైనవి. వారి చిలిపి చేష్టలూ వెలకట్టలేనివి. కానీ ఈ ప్రేమలో పడి ప్రతీ తల్లితండ్రులు చేస్తున్న…

Mpox: ఆఫ్రికాను వణికిస్తోన్న ఎంపాక్స్.. 610 మందికిపైగా మృతి

Mana Enadu: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశా(African Countries)ల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్(Virus) మిగతా ఖండాల్లోని అనేక దేశాలకు పాకుతోంది. దీంతో ప్రజలతోపాటు ఆయా ప్రభుత్వాలు, అధికారులు ఆందోనళ చెందుతున్నారు. అటు ఆరోగ్య…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *