ManaEnadu: హైదరాబాద్ నగరంలోనే బీఆర్ఎస్ బలంగా ఉందనే భావనలో ఉన్న కేసీఆర్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. మరో మున్సిపల్ ఛైర్మన్ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపి గూటికి వెళ్లేందుకు సిద్దం అయ్యారు.
తొలి..ఆఖరి ఛైర్మన్ ఆయనే:
నాగారం పంచాయితీ నుంచి మున్సిపల్ అప్గ్రేడ్ అయిన తర్వాత తొలి మున్సిపల్ ఛైర్మన్గా కౌకట్ల చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ హయంలో మల్లారెడ్డి అనుచరుడిగా ఉంటూనే కేటీఆర్తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. దీంతో వందల కోట్ట నిధులతో నాగారం ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మాణాలు ప్రారంభం అయ్యాయి. నాగారం(Nagaram) ఛైర్మన్ చంద్రారెడ్డిపై కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ చివరకు నెగ్గకుండా రాజకీయం చేసి మళ్లీ ఛైర్మన్గానే కొనసాగుతున్నారు.
మల్కాజిగిరి(Malkajgiri)పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయబోతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు నాగారం మున్సిపల్ ఛైర్మన్ కౌకట్ల చంద్రారెడ్డికి ఉన్నాయి. ఈక్రమంలో వారం రోజుల్లోపే ఈటెల సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బలంగా శనివారం ఛైర్మన్ మొబైల్ స్టేటస్గా ఈటెల సందేశాన్ని పెట్టుకోవడంతో మరింత బలం చేకూరింది.
సీఎం రేవంత్రెడ్డి సర్కారు ఓఆర్ఆర్(ORR)లోపల ఉన్న మున్సిపాలటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ(GHMC) కలుపుతూ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆతర్వాత ఎన్నికలే జరిగా అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా జరిగితే నాగారం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్..ఆఖరి ఛైర్మన్గా కౌకట్ల చంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నాగారం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది.