బీఆర్​ఎస్ కు​ మరోషాక్..BJP గూటికి మున్సిపల్ ఛైర్మన్​

ManaEnadu: హైదరాబాద్​ నగరంలోనే బీఆర్​ఎస్​ బలంగా ఉందనే భావనలో ఉన్న కేసీఆర్ కు వరుస షాక్​లు తగులుతున్నాయి. మరో మున్సిపల్​ ఛైర్మన్​ ఈటెల రాజేందర్​ సమక్షంలో బీజేపి గూటికి వెళ్లేందుకు సిద్దం అయ్యారు.

తొలి..ఆఖరి ఛైర్మన్​ ఆయనే:
నాగారం పంచాయితీ నుంచి మున్సిపల్​ అప్​గ్రేడ్​ అయిన తర్వాత తొలి మున్సిపల్ ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. బీఆర్​ఎస్​ హయంలో మల్లారెడ్డి అనుచరుడిగా ఉంటూనే కేటీఆర్​తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. దీంతో వందల కోట్ట నిధులతో నాగారం ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్​ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మాణాలు ప్రారంభం అయ్యాయి. నాగారం(Nagaram) ఛైర్మన్​ చంద్రారెడ్డిపై కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ చివరకు నెగ్గకుండా రాజకీయం చేసి మళ్లీ ఛైర్మన్​గానే కొనసాగుతున్నారు.

మల్కాజిగిరి(Malkajgiri)పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయబోతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు నాగారం మున్సిపల్​ ఛైర్మన్​ కౌకట్ల చంద్రారెడ్డికి ఉన్నాయి. ఈక్రమంలో వారం రోజుల్లోపే ఈటెల సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బలంగా శనివారం ఛైర్మన్​ మొబైల్​ స్టేటస్​గా ఈటెల సందేశాన్ని పెట్టుకోవడంతో మరింత బలం చేకూరింది.

సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఓఆర్​ఆర్​(ORR)లోపల ఉన్న మున్సిపాలటీలు, కార్పొరేషన్లను జీహెచ్​ఎంసీ(GHMC) కలుపుతూ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆతర్వాత ఎన్నికలే జరిగా అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా జరిగితే నాగారం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్​..ఆఖరి ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నాగారం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *