బీఆర్​ఎస్ కు​ మరోషాక్..BJP గూటికి మున్సిపల్ ఛైర్మన్​

ManaEnadu: హైదరాబాద్​ నగరంలోనే బీఆర్​ఎస్​ బలంగా ఉందనే భావనలో ఉన్న కేసీఆర్ కు వరుస షాక్​లు తగులుతున్నాయి. మరో మున్సిపల్​ ఛైర్మన్​ ఈటెల రాజేందర్​ సమక్షంలో బీజేపి గూటికి వెళ్లేందుకు సిద్దం అయ్యారు.

తొలి..ఆఖరి ఛైర్మన్​ ఆయనే:
నాగారం పంచాయితీ నుంచి మున్సిపల్​ అప్​గ్రేడ్​ అయిన తర్వాత తొలి మున్సిపల్ ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. బీఆర్​ఎస్​ హయంలో మల్లారెడ్డి అనుచరుడిగా ఉంటూనే కేటీఆర్​తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. దీంతో వందల కోట్ట నిధులతో నాగారం ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈక్రమంలోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి.

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మున్సిపల్​ ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మాణాలు ప్రారంభం అయ్యాయి. నాగారం(Nagaram) ఛైర్మన్​ చంద్రారెడ్డిపై కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ చివరకు నెగ్గకుండా రాజకీయం చేసి మళ్లీ ఛైర్మన్​గానే కొనసాగుతున్నారు.

మల్కాజిగిరి(Malkajgiri)పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్(Etela Rajender) పోటీ చేయబోతున్నారు. ఆయనతో సన్నిహిత సంబంధాలు నాగారం మున్సిపల్​ ఛైర్మన్​ కౌకట్ల చంద్రారెడ్డికి ఉన్నాయి. ఈక్రమంలో వారం రోజుల్లోపే ఈటెల సమక్షంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారానికి బలంగా శనివారం ఛైర్మన్​ మొబైల్​ స్టేటస్​గా ఈటెల సందేశాన్ని పెట్టుకోవడంతో మరింత బలం చేకూరింది.

సీఎం రేవంత్​రెడ్డి సర్కారు ఓఆర్​ఆర్​(ORR)లోపల ఉన్న మున్సిపాలటీలు, కార్పొరేషన్లను జీహెచ్​ఎంసీ(GHMC) కలుపుతూ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆతర్వాత ఎన్నికలే జరిగా అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా జరిగితే నాగారం మున్సిపాలిటీ తొలి ఛైర్మన్​..ఆఖరి ఛైర్మన్​గా కౌకట్ల చంద్రారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు. ఆతర్వాత జరిగే ఎన్నికల్లో నాగారం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు కార్పొరేటర్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది.

Related Posts

INDvsENG 2nd T20: తిలక్ సూపర్ ఇన్నింగ్స్.. భారత్‌ను గెలిపించిన తెలుగోడు

చెన్నై(Chennai) వేదికగా ఇంగ్లండ్‌(England)తో ఉత్కంఠగా జరిగిన రెండో T20లో భారత్(Team India) విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 166 పరుగులను 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (72) సూపర్ హాఫ్ సెంచరీ చేసి జట్టుకు…

Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించింన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని(Republic Day 2025) పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల(Padma Awards)ను ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *