Rythu Bandhu: రైతు బంధు రైతుల అకౌంట్లోకి.. మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి..!!

మన ఈనాడు: రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా జమ అయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందనుంది.

తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రైతు బంధు డబ్బులు రైతులు అకౌంట్లో జమయ్యాయి. అయితే ఒక్కో రైతుకు ఒక్కో విధంగా డబ్బులు పడ్డాయి. ఒక రైతుకు రూ.1 మాత్రమే రైతు బంధు సాయం కింద అందించింది. రాష్ట్ర సర్కార్ నుంచి ఇన్ పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతు అకౌంట్లో జమ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమచేస్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ డబ్బులను విడుదల చేసింది.

ఐదేకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం లభిస్తోంది. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందించింది. ఈ డబ్బులు రెండు విడతల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. అయితే ఈ యాంసంగి సీజన్ మాత్రం రైతుకు రూ. 1 మాత్రమే లభించింది.

Related Posts

Texas Floods: టెక్సాస్‌లో ఆకస్మిక వరదలు.. వంద మందికిపైగా మృతి

అమెరికాలోని టెక్సాస్(Texas) రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక వరదలు(Flash floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ జల ప్రళయంలో మరణించిన వారి సంఖ్య 104 మంది మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా చాలా మంది గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత…

Shiva Shakti Datta: టాలీవుడ్‌లో విషాదం.. ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తిదత్తా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) తండ్రి, ప్రసిద్ధ సినీ గేయ రచయిత శివ శక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. 93 ఏళ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *