Chengicharla: ఆడబిడ్డలపై దాడులు చేసినా..పోలీసులు పట్టించుకోవడం లేదు: బండి సంజయ్​

చెంగిచర్ల ఘటనలో గాయపడిన మహిళా కుటుంభాలను కరీంనగర్​ ఎంపీ, భారతీయ జనతాపార్టీ నాయకుడు బండి సంజయ్​ బుధవారం పరామర్శించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

బండి సంజయ్​ పర్యటన చెంగిచర్లలో ఉద్రిక్తతగా మారింది. హోళీ వేడుకలు జరుపుకుంటున్న కుటుంభాలపై ఓవర్గం కావాలనే దాడులకు తెగబడిందని ఆరోపిస్తూ పెద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్​రెడ్డితోపాటు మల్కాజ్​గిరి పార్లమెంట్​ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ పరామర్శించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రాచకొండ పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్​ నిర్వహిస్తున్నారు. బండి సంజయ్​ పర్యటన అడ్డుకోవడంతో బారికేడ్లు దూకి చెంగిచెర్ల చేరుకున్నారు. మేడిపల్లి పోలీసులు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు.

Related Posts

Telangana Congress: త్వరలో ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన?

తెలంగాణ(Telangana)లో కాంగ్రెస్(Congress) సర్కార్ కొలువుదీరి ఏడాది పూర్తయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే మొత్తం 18 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 12 శాఖలకే మంత్రులున్నారు. కీలకమైన…

BJP-Megastar: చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా? బీజేపీ స్కెచ్ ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పొలిటికల్ రీ ఎంట్రీ(Political Re-Entry)కి రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇందుకు తాజాగా జరిగిన సంఘటనలను కారణాలుగా అభివర్ణిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఢిల్లిలోని తన నివాసంలో నిర్వహించిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *