Chengicharla: ఆడబిడ్డలపై దాడులు చేసినా..పోలీసులు పట్టించుకోవడం లేదు: బండి సంజయ్​

చెంగిచర్ల ఘటనలో గాయపడిన మహిళా కుటుంభాలను కరీంనగర్​ ఎంపీ, భారతీయ జనతాపార్టీ నాయకుడు బండి సంజయ్​ బుధవారం పరామర్శించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.

బండి సంజయ్​ పర్యటన చెంగిచర్లలో ఉద్రిక్తతగా మారింది. హోళీ వేడుకలు జరుపుకుంటున్న కుటుంభాలపై ఓవర్గం కావాలనే దాడులకు తెగబడిందని ఆరోపిస్తూ పెద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్​రెడ్డితోపాటు మల్కాజ్​గిరి పార్లమెంట్​ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ పరామర్శించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రాచకొండ పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్​ నిర్వహిస్తున్నారు. బండి సంజయ్​ పర్యటన అడ్డుకోవడంతో బారికేడ్లు దూకి చెంగిచెర్ల చేరుకున్నారు. మేడిపల్లి పోలీసులు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *