Online Betting: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌..ముగ్గురి ఊపిరి తీసింది..!

కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

RangaReddy:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీలో ఉంటున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన ఇందిరకు నాలుగేళ్ల క్రితం రామంతాపూర్‌కు చెందిన ఆనంద్‌తో వివాహం జరిగింది. మూడేళ్లుగా బండ్లగూడజాగీర్‌ పరిధిలోని సన్‌సిటీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు.

ఇందిర ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. ఆనంద్ కొంతకాలం పాలవ్యాపారం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటుపడిన ఆనంద్.. తరచూ డబ్బులు పోగొట్టుకునేవాడు. దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ఇందిర బంగారంతో పాటు కారును కూడా అమ్మేశాడు

దీంతో మల్కాపూర్‌కు వెళ్లాలని దంపతులు నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ల తోడల్లుడికి ఫోన్‌ చేసిన ఆనంద్.. తాము చనిపోతున్నట్టు చెప్పాడు. ఇంతలోనే భార్య, కుమారుడికి విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి.. తాను కూడా తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వల్లే వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలై.. చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

Share post:

లేటెస్ట్