TG News|పోలీసుల దాడి…. భవనం పైనుంచి దూకిన పేకాటరాయుడు

Mana Enadu: లాలాగూడలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడులు చేశారు. పోలీసులను చూసి భవనంపై పేకాటరాయుళ్లు పరుగులు పెట్టారు. తప్పించుకునే క్రమంలో వినయ్‌ అనే యువకుడు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వినయ్‌ (28) మృతి చెందాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాట రాయుళ్లను వద్ద నగదును స్వాధీనం చేసుకున్నారు.

Share post:

లేటెస్ట్