Mana Enadu: కోర్డు సీజ్ చేసిన రూ.5కోట్ల విలువైన మత్తు పదార్థాలను నల్లొండ జిల్లా పోలీసులు కాల్చే బూడిద చేశారు. 2043కేజీల గంజాయిను పోలీసు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్పీ చందనా దీప్తి (IPS Chandana deepthi) పదిహేను పోలీసు స్టేషన్లు పరిధిలో సీజ్ చేసిన గంజాయిను బూడిద చేసేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఈక్రమంలోనే నల్గొండ(Nalgonda) జిల్లా – నార్కట్పల్లి మండలం గుమ్మళ్ళబావి గ్రామంలో ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షణలో పోలీసులు దహనం చేశారు.
Israel-Hamas War: గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్.. 80 మంది మృతి!
గాజా స్ట్రిప్(Gaza Strip)పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 80 మంది పాలస్తీనియన్లు (Palestinians) ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది గాయపడ్డారని పాలస్తీనా వైద్య వర్గాలు(Palestinian medical communities) వెల్లడించాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్…