Janasena: అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామ కృష్ణ తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాలరామ కృష్ణ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి కొణతాల మీడియా సమావేశం నిర్వహించారు.

అనకాపల్లిలో పవన్ సభను విజయజవంతం చేసినందుకు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రలో పవన్ అనేక హామీలు ఇచ్చారని, యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తమ ముందున్న సవాళ్లని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని తెలిపారు.

Related Posts

Madhavi Latha Issue: JC ప్రభాకర్ రెడ్డికి షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తాడిపత్రి మాజీ MLA జేసీ ప్రభాకర్‌ రెడ్డి(JC Prabhakar Reddy)కి పోలీసులు షాకిచ్చారు. సినీ నటి మాధవీ లత(Madhavi Latha)పై అసభ్యకరమైన కామెంట్స్ చేసినందుకు ఆయనపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు(Cyberabad Cyber ​​Crime Police) పలు సెక్షన్ల కింద కేసు…

Delhi CM: ఈనెల 19 లేదా 20న ఢిల్లీ సీఎం అభ్యర్థి ప్రమాణం!

అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలు ఈ నెల 8న వెలువడిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో BJP రికార్డు స్థాయిలో 48 సీట్లు నెగ్గి ఘనవిజయం సాధించింది. అంత వరకూ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *