Bandi Sanjay : కొత్తపల్లిలో కాంగ్రెస్‌పై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Bandi Sanjay : కొత్తపల్లి బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘మేం బరాబర్ రాముడి భక్తులమే.. నేను పక్కా లోకల్.. గరీబోళ్ల బిడ్డను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోబెల్స్ వారసుడు’’ అంటూ ఆరోపించారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ మండిపడ్డారు.

అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అంటూ బీజేపీ ఎంపీ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

ఒక్కో కార్పొరేటర్ బ్యాంకు అకౌంటులో రూ.5 లక్షల జమ చేశారన్నారు. తక్షణమే ఎన్నికల సంఘం బ్యాంకు లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బలుపెక్కి దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నడని బండి సంజయ్ విమర్శించారు.

Related Posts

Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్

ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…

Gold&Silver Price: తగ్గిన బంగారం ధరలు.. కేజీ వెండి రేటు ఎంతంటే?

గత 15 రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు(Gold Rates) ఎట్టకులకు తగ్గాయి. ఈనెలలో రికార్డు స్థాయికి చేరిన పుత్తడి ధర సామాన్యులకు అందుబాటులో లేకుండా పైపైకి ఎగబాకింది. ఈ క్రమంలో బంగారు ఆభరణాల(gold jewellery)కు డిమాండ్‌ 80శాతం వరకు పడిపోయింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *