BJYM:బీజేవైఏం రాష్ట్ర అధికార ప్రతినిధిగా మల్క యశస్వి…!!

బీజేవైఏం అధికార ప్రతినిధిగా సికింద్రాబాద్ మహేంద్రహిల్స్ కి చెందిన మల్క యశస్వి నియమితులయ్యారు. ఆ మేరకు బుధవారం బీజేపి రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

మల్క యశస్వి బిట్స్ పిలాని దుబాయ్ క్యాంపస్ లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్,(DPS) పల్లవి స్కూల్స్, ఎకో భారత్ కంపెనీ సీఈవోగా కొనసాగుతున్నారు. తన తండ్రి కొమరయ్య స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పదవి తనపై బాధ్యతను పెంచిందని వివరించారు.

Share post:

లేటెస్ట్