Pawan Kalyan : ‘ఆమె విజయం.. నా గుండెను కదిలించింది’

ManaEnadu:ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. ప్రజలకు కష్టమొస్తే వారి వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. పదవి నాకు అలంకారం కాదు.. మీరు నా చేతిలో పెట్టిన బాధ్యత. మీకోసం పని చేయడానికి ఎల్లప్పుడూ నేను సిద్ధం. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేను చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.

‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ‘గ్రామసభలు’ నిర్వహించారు. మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పవన్ కల్యాణ్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీకి సొంత భూమి ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని, అవసరమైతే గూండా యాక్టు కూడా తెస్తామని అన్నారు.

మరోవైపు మైసూరువారిపల్లె సర్పంచ్‌ కారుమంచి సంయుక్తపై పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు కురిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలంటేనే భయపడే సమయంలో ఆమె బరిలో నిలిచారని కొనియాడారు. ఎన్నికల సమయంలో రోడ్లపైకి రావాలంటేనే అందరూ భయపడే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి సంయుక్త విజయం సాధించారని ప్రశంసించారు. మిలిటరీలో పనిచేసిన భర్తను కోల్పోయి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావించడం నిజంగా తన గుండెను కదిలించిందని తెలిపారు. సంయుక్త పట్టుదల చేసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆమె గెలిచాక చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు.

“అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటాం. పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చే వారిని నేను వదలుకోను. మనుషులను కలుపుకొనే వ్యక్తిని కానీ విడగొట్టేవాణ్ని కాదు. గ్రామాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంలో గ్రామసభ చాలా ముఖ్యం. గత ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. 13 వేల 326 పంచాయతీలు బలపడితే రాష్ట్ర అప్పులన్నీ తీర్చగలం.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *