హైదరాబాద్‌- విజయవాడ హైవేలో వాహనాల రాకపోకలు పునరుద్ధరణ

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu) అతలాకుతలం చేశాయి. ఇప్పటికీ చాలా పల్లెలు, పట్టణాలు వరద ముంపులోనే ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో వాగులు, చెరువులు పొంగి అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉప్పొంగిన వాగులు రహదారులపైకి చేరి పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కీలక రహదారి అయిన హైదరాబాద్ విజయవాడ (Vijayawada Hyderabad High Way) మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అయితే  భారీ వరదలతో హైదరాబాద్‌- విజయవాడ హైవే (Hyderabad Vijayawda National High Way)లో నిలిచిపోయిన వాహనాల రాకపోకలను తాజాగా అధికారులు పునరుద్ధరించారు. దాదాపు 30గంటల తర్వాత ఎన్‌హెచ్‌-65పై వాహనాల రాకపోకలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు వద్ద కొత్త బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగుతున్నాయి. అయితే వాహనదారులు బ్రిడ్జిపై నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల(Rain Alert in AP)  మధ్య రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా నందిగామ మండలంలో మున్నేరు వరద తగ్గడంతో పోలీసులు ఐతవరం వద్ద వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే ఐతవరంలో నిలిచిన వాహనాలను పోలీసులు దగ్గరుండి పంపిస్తున్నారు. 

విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద వరద ప్రవహిస్తుండటంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పోలీసులు.. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వాహనంలో ఎక్కి వరద దాటారు. గత మూడు రోజులుగా మైలవరం నియోజకవర్గంలో ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే.. తన స్వగ్రామం ఐతవరం గ్రామాన్ని సందర్శించారు. మధ్యలో వరద ఉండటంతో హైడ్రా వాహనంలో ఎక్కి బయటకు వచ్చారు. 

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *