Khammam|నామా కోసం బాబు.. ఖమ్మం ఎంపీ నామా రాజీనామా..?

ఖమ్మం(Khammam) రాజకీయాల్లో(Politics) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్‌ నేత నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao) బీజేపీలో(BJP) చేరతారనే ప్రచారం రెండు రోజులుగా విస్తృతంగా జరుగుతుంది. తెలంగాణ(Telangana) బీజేపీ నేతలు శుక్రవారం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఈ నెల 22 న బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం జరబోతుందని సమాచారం.

ఇప్పటికే ఖమ్మం టికెట్​ కోసం బీజేపీ పెద్దలతో టిడిపి( TDP) అధినేత చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. ఈక్రమంలోనే బీఆర్​ఎస్​ నుంచి ఖమ్మం ఎంపీగా నామా పేరును కేసీఆర్​(KCR) ప్రకటించారు. కానీ దీనికి నామా సుముఖంగా లేరు. అప్పుడే బీజేపీ నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబును నామా కలిసిరాని సమాచారం. నామా కోసం బాబు రంగంలోకి దిగారని తెలుస్తుంది.

తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలను బీజేపీ(BJP) ప్రస్తుతం పెండింగ్‌ లో పెట్టింది. అవే ఖమ్మం, వరంగల్‌. ఇప్పటికే ఆరూరి రమేశ్‌ కు వరంగల్‌ టికెట్‌ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానం గురించి ఎటూ తేల్చుకోలేని స్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం స్థానాన్ని టీడీపీ కి ఇచ్చే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చర్చంతా నడుస్తుండగానే ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

ఖమ్మం టికెట్‌ ఆశించిన బీఆర్‌ఎస్‌(BRS) మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీజేపీ గూటికి చేరారు. పార్టీ మార్పు గురించి నామా మాత్రం నోరు విప్పలేదు. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇక్కడ టీడీపీ పోటీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ సహా మిగిలిన బీజేపీ సీనియర్‌ నేతలు..టీడీపీ తెలంగాణలో పోటీ చేయాల్సిన అవసరం లేదని.. పూర్తిగా తెలంగాణలో మేమే పోటీ చేస్తామనే పరిస్థితి కనిపిస్తోంది.

Share post:

లేటెస్ట్