ఇతను కదా రియల్​ హిరో ఆంజనేయ యాదవ్​..

మన Enadu: ఇతరులకు సహాయం చేయాలంటే స్తోమతతో పనిలేదు.. మంచి మనసుంటే చాలు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ తాలుకాకు చెందిన ఆంజనేయ యాదవ్‌ అనే యువకుడు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాడు.

నిత్యం పాఠశాలకు 3 నుంచి – 4 కిలోమీటర్లు నడిచివెళ్లే విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చాడు. రోజువారీ కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో రూ.40 వేలు పొదుపు చేసి విద్యార్థులకు సాయం చేశాడు. మల్కందిన్ని గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హైస్కూలు చదువుల కోసం సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్లాలి.

గ్రామ విద్యార్థులు రోజూ అంత దూరం నడిచి వెళ్లడాన్ని ఆంజనేయ యాదవ్‌ గమనించాడు. ”రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ పిల్లల చదువు అలా ఆగిపోకూడదని సైకిళ్లు పంపిణీ చేశాను” అని తెలిపాడు.

Related Posts

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

ఏపీ(Andhra Prsadesh)లోని రాష్ట్రంలోని విద్యార్థులకు(Inter Students) ఇంటర్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Intermediate Public Advanced Supplementary Exams) పరీక్షల కోసం పరీక్ష ఫీజు(Fee) చెల్లింపు గడువు తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.…

TG 10th Results: విద్యార్థలకు అలర్ట్.. రేపే పదో తరగతి ఫలితాలు!

తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు(TG 10th Class Results) రేపు మధ్యాహ్నం (ఏప్రిల్ 30) ఒంటిగంటకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదలచేయనున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *