ఇతను కదా రియల్​ హిరో ఆంజనేయ యాదవ్​..

మన Enadu: ఇతరులకు సహాయం చేయాలంటే స్తోమతతో పనిలేదు.. మంచి మనసుంటే చాలు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా దేవదుర్గ తాలుకాకు చెందిన ఆంజనేయ యాదవ్‌ అనే యువకుడు ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాడు.

నిత్యం పాఠశాలకు 3 నుంచి – 4 కిలోమీటర్లు నడిచివెళ్లే విద్యార్థులకు 11 సైకిళ్లు కొనిచ్చాడు. రోజువారీ కూలిపనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులో రూ.40 వేలు పొదుపు చేసి విద్యార్థులకు సాయం చేశాడు. మల్కందిన్ని గ్రామంలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. హైస్కూలు చదువుల కోసం సుమారు 4 కి.మీ.ల దూరంలో ఉన్న యమనూరుకు వెళ్లాలి.

గ్రామ విద్యార్థులు రోజూ అంత దూరం నడిచి వెళ్లడాన్ని ఆంజనేయ యాదవ్‌ గమనించాడు. ”రవాణా సౌకర్యం సరిగ్గా లేని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా కొందరు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ పిల్లల చదువు అలా ఆగిపోకూడదని సైకిళ్లు పంపిణీ చేశాను” అని తెలిపాడు.

Related Posts

HAPPY TEACHERS DAY 2024 : తెలంగాణలో ఉత్తమ టీచర్లుగా 103 మంది.. నేడే అవార్డుల ప్రదానం

ManaEnadu:“గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర; గురు సాక్షాత్ పరః బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః”. గురువే ఆ బ్రహ్మదేవుడు, గురువే ఆ విష్ణుమూర్త, గురువే మనలోని అజ్ఞానాన్ని పారద్రోలే ఆ మహేశ్వరుడు. అటువంటి గురువుకు శిరస్సువంచి…

Holidays:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో మూడ్రోజులు పాఠశాలలకు సెలవులు

ManaEnadu:తెలుగు రాష్ట్రాలను వరణుడు (Telangana Rains) ఇంకా వీడటం లేదు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట, నిర్మల్​, నిజామాబాద్​, పెద్దపల్లి,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *