జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ .. కాంప్లిమెంటరీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్.. ఇదిగో వివరాలు!

Mana Enadu:రిలయన్స్ జియో యూజర్లకు అలర్ట్. వినియోగదారుల కోసం ఈ కంపెనీ మూడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ రీఛార్డ్ ప్లాన్స్.. ఓటీటీ (ఓవర్ ది టాప్) సబ్‌స్క్రిప్షన్లతో కలుపుకొని వస్తున్నాయి. మీరు ఈ ప్లాన్ రీఛార్డ్ చేసుకుంటే ఇంటర్నెట్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌కు అదనంగా ప్రముఖ ఓటీటీల కంటెంట్​ను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.

రూ.329 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజు 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తుంది. వీటికి తోడుగా 28 రోజుల వ్యాలిడిటీతో ‘జియో సావన్ ప్రో’ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ లభిస్తుంది.
రూ.949 ప్లాన్ : ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజు 2 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. వీటితోపాటు 84 రోజుల వ్యాలిడిటీతో ‘డిస్నీ + హాట్ స్టార్’ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్ స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
రూ.1,049 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌లో రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్‌ సదుపాయం ఉంటుంది. కాంప్లిమెంటరీగా.. 84 రోజుల వ్యాలిడిటీతో ‘జీ5 – సోనీ లివ్’ కాంబో సబ్​స్క్రిప్షన్ ప్లాన్ వస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్​స్క్రిప్షన్ కూడా వస్తోంది.

మరోవైపు జియో తాజాగా  ‘జియో భారత్ జే1 4జీ’ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.1,799గా నిర్ణయించారు. బ్లాక్, గ్రే కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది.  దీన్ని అమెజాన్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *