Andhra Pradesh: తిరుపతిలో దారుణం.. ప్రేమ పేరుతో ఒకడు.. దెయ్యం పట్టిందని మరొకరు..

Mana Enadu: తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం చోటుచేసుకుంది.. ఓ మైనర్‌ బాలిక (14) పై ఇద్దరు మృగాళ్లు ఉన్మాదానికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ కుటుంబం పిల్లల చదువుల కోసం తిరుపతికి వచ్చింది. బాధితురాలు ఓ ప్రైవేటు స్కూల్ లో 9 వ తరగతి చదువుతోంది.

7 నెలల క్రితం ట్రైన్ లో ప్రయాణం చేస్తుండగా మహమ్మద్ షఫీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తన పేరు అభిరామ్ అని తిరుపతిలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు షఫీ బాలికను నమ్మించాడు. మహమ్మద్ షఫీతో ఏర్పడ్డ పరిచయంతో తరచూ ఫోన్ లో మాట్లాడిన మైనర్ బాలిక ప్రేమలో పడింది. మహమ్మద్ షఫీ అవసరాలకు ఇంట్లోని డబ్బు నగలను తీసుకెళ్లి ఇచ్చింది. ఇంటిలోని డబ్బు, నగలు కనిపించక పోవడంతో నిలదీసిన తల్లి దండ్రులకు అసలు విషయం చెప్పింది..
షఫీతో ఉన్న ప్రేమ వ్యవహారాన్ని చెప్పిన కూతురుకు దెయ్యం పట్టిందని కొందరి సలహాతో రేణిగుంటలోని రాజరాజేశ్వరీ ఆశ్రమానికి వెళ్ళి.. బాధిత కుటుంబం మూర్తి స్వామిని కలిసింది. బాలిక మానసిక స్థితి బాగోలేదని, దెయ్యం పట్టిందని నమ్మించిన ఆశ్రమ నిర్వాహకుడు మూర్తి స్వామి 3 రోజులపాటు బాలికతో అర్ధరాత్రి ఒంటరిగా పూజలు చేయాలన్నాడు. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులను నమ్మించాడు.. ఫిబ్రవరి 20న రాత్రి మైనర్ బాలికను పూజల చేయించేందుకు ఆశ్రమానికి తీసుకెళ్ళాడు తండ్రి.. 3 రోజులుపాటు రాత్రిపూట బాలికను ఆశ్రమానికి తీసుకురావాలన్న స్వామీజీ ఆదేశం మేరకు పేరెంట్స్ ఫాలో అయ్యారు. ఈ క్రమంలో మూర్తి స్వామి తండ్రిని ఒక గదిలో ఉంచి మరొక గదిలోకి మైనర్ బాలికను తీసుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

లైంగిక దాడి విషయం బయట వ్యక్తులకు చెబితే తల్లిదండ్రులకు క్షుద్రపూజలు చేసి కాళ్ళు చేతులు పోగడతానని మైనర్ బాలికను భయపెట్టాడు మూర్తి స్వామి. జరిగిన అఘాయిత్యానికి తల్లిదండ్రులకు చెబితే లాభం లేదనుకున్న బాలిక ప్రియుడు మహమ్మద్ షఫీకి చెప్పింది. మూర్తిస్వామి దొంగ అవతారాన్ని బయట పెడతానన్న మహమ్మద్ షఫీ.. మరుసటి రోజు తల్లిదండ్రులతో ఆశ్రమానికి యధావిధిగా వచ్చిన మైనర్ బాలికను పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. స్నేహితులు షమర్, శరత్ లతో సాయంతో మైనర్ బాలికను కారులో తీసుకెళ్లాడు..

Related Posts

IMD Report: దేశంలో ప్రకృతి ప్రకోపం.. గత ఏడాది 3200 మంది మృతి

భారత్‌(India)లో ప్రకృతి వైపరీత్యాలు(Natural Calamities) ఈ మధ్య తీవ్రంగా ప్రతాపం చూపుతున్నాయి. తాజాగా దేశంలో ప్రకృతి వైపరీత్యాల ద్వారా 3200 మంది మరణించారని భారత వాతావరణ వార్షిక నివేదిక(Indian Meteorological Annual Report-2024) పేర్కొంది. ఇందులో అత్యధికంగా పిడుగుల ద్వారా 1374…

BIG BREAKING: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుల దాడి

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‌(Saif Ali Khan)పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ముంబై(Mumbai)లోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగులు ఇవాళ తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆయనపై కత్తితో అటాక్(Knife Attack) చేశారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *