Rana:రానా పాన్ ఇండియా మూవీకి ముహార్తం

ManaEnadu: రానా(Rana Daggubati), దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో వెంకటేష్‌ క్లాప్‌నిచ్చారు. దర్శకుడు మాట్లాడుతూ ‘1950 మద్రాస్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. నాటి సాంఘిక పరిస్థితుల్లో మానవ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ సాగుతుంది’ అన్నారు.

నటుడిగా పర్‌ఫార్మ్‌ చేయడానికి ఎంతో స్కోప్‌ ఉన్న పాత్ర ఇదని దుల్కర్‌ సల్మాన్‌ తెలిపారు. పీరియాడిక్‌ కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని రానా పేర్కొన్నారు. సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse )తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: డాని శాంచెజ్‌ లోపెజ్‌, సంగీతం: జాను, నిర్మాణ సంస్థ: స్పిరిట్‌ మీడియా(SpiritMedia), వేఫేరర్‌ ఫిల్మ్స్‌, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్‌, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్‌.

 

 

Related Posts

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *