నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది.. పాలీగ్రాఫ్‌ పరీక్షలో కోల్​కతా డాక్టర్ ఘటన నిందితుడు

ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌కి ఇటీవల పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైల్లో ఉన్న అతడికి లై డిటెక్టర్‌ పరీక్ష చేపట్టారు. అయితే ఇందులో నిందితుడు ఏం చెప్పారన్న వివరాలను గోప్యంగా ఉంచారు.

పాలీగ్రాఫ్‌ పరీక్షలో నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. తాను వెళ్లేసరికే వైద్యురాలు చనిపోయిందని అతడు చెప్పినట్లు తెలిసింది. ఈ పరీక్ష సమయంలో సంజయ్‌ అనాలోచితంగా, ఆత్రుతగా ఉన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. అధికారులు అడిగిన ప్రశ్నలకు అబద్ధాలు, సరిపోలని సమాధానాలు చెప్పినట్లు తెలిపాయి.

దర్యాప్తు బృందం ఆధారాలు చూపించినప్పుడు ఆ సమయంలో తాను అక్కడ లేనని నిందితుడు చెప్పినట్లు సమాచారం. తాను సెమినార్‌ హాల్‌కు వెళ్లేసరికి వైద్యురాలు అప్పటికే చనిపోయి ఉందని తెలిపాడట. భయంతో తాను అక్కడి నుంచి పారిపోయానని సంజయ్‌ చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు, నిందితుడికి పాలీగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించే సమయంలో అతడి తరఫు డిఫెన్స్‌ లాయర్‌ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. పరీక్ష ఎక్కడ నిర్వహిస్తామన్నది అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని మండిపడ్డారు.

ఘటన సమయంలో ప్రతీ నిమిషం చోటుచేసుకున్న విషయాలను నిందితుడు గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడని, అతడిలో పశ్చాత్తాపమే లేనట్లు కన్పించిందని ఓ సీబీఐ అధికారి చెప్పినట్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత అతడిని కోర్టులో హాజరుపర్చగా అసలు తాను ఏ తప్పూ చేయలేదని వాపోయాడు. కావాలనే తనను ఇందులో ఇరికించారని న్యాయస్థానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Related Posts

Airstrikes: గాజాలో మళ్లీ కాల్పుల మోత.. 400 మందికిపైగా మృతి

కాల్పుల మోతతో గాజా(Gaza) మళ్లీ దద్దరిల్లింది. సీజ్‌ఫైర్ ఒప్పందం ముగియడంతో గాజాపై ఇజ్రాయెల్ సైన్యాలు వైమానిక(Israeli forces airstrikes) దాడులతో విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడ దాదాపు 400కు పైగా జనం మృతి చెందినట్లు గాజా హెల్త్ డిపార్ట్ మెంట్(Gaza Health Department)…

రన్యారావు కేసులో తెలుగు హీరో అరెస్టు

బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ (Gold Smuggling Case) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితురాలు కన్నడ నటి రన్యారావు (Ranya Rao) వెనుక ఓ తెలుగు నటుడు కింగ్ పిన్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *