SKY: నా ఏమ్ అదే.. రెడ్‌బాల్ క్రికెట్‌పై సూర్యకుమార్ కామెంట్స్

Mana Enadu: SKY.. అదేనండీ సూర్యకుమార్ యాదవ్(Suryakumar yadav). అభిమానులు ముద్దుగా స్కై అని పిలుచుకుంటారు. ఈ టీమ్ఇండియా(TeamIndia) హిట్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విధ్వంసకర హిట్టింగ్‍కు కేరాఫ్ అడ్రస్‍. తన విభిన్నమైన షాట్లతో ధనాధన్ ఆట ఆడతాడు సూర్యకుమార్ యాదవ్. అతడు క్రీజులో ఉంటే బంతి ఎక్కడ పడింది.. ఎంత స్పీడులో వస్తుందనేది చూడడు. తన గేమ్.. తన ఏమ్ ఒక్కటే బంతి బౌండరీ వెళ్లిందా? లేదా? ముఖ్యంగా T20 Cricketలో సూర్యకుమార్ ఆట గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈ ఫార్మాట్లో చాలా కాలం పాటు అతడు ప్రపంచ నంబర్ (ప్రస్తుతం 2వ ర్యాంక్) ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ బాధ్యత వచ్చాక సూర్యలో దూకుడు తగ్గుతుందని ఫ్యాన్స్‌లో కొంత సందేహం ఉండేది. కానీ వాటన్నింటినీ స్కై కొట్టిపారేశాడు. తాను కెప్టెన్‍ను అయినా తన దూకుడైన స్టైల్‍లో ఏ మాత్రం మార్పు ఉండదని చెప్పేశాడు.

ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు

అయితే వైట్ బాల్ క్రికెట్(White ball Cricket) వరకూ సూర్య ఓ అటాకింగ్ ప్లేయర్. కానీ టెస్టు జట్టులో మాత్రం అతడికి ప్లేసే ఉండదు. ఈ నేపథ్యంలో టెస్టు ఫార్మాట్‌ సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన మొదటి ప్రాధాన్యత టెస్టు క్రికెట్ అని పేర్కొన్నాడు. భారత టెస్టు జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌(Internatinal Cricket)లో అరంగేట్రం చేసిన సూర్య ప్రస్తుతం టీ20 జట్టుకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. టీ20ల్లో చెలరేగే ఈ విధ్వంసకర బ్యాటర్ వన్డేల్లో నిరాశపరచడంతో ఆ ఫార్మాట్‌లోనూ జట్టులో చోటు కోల్పోయాడు. ఇక 33 ఏళ్ల ఈ హిట్టర్ ఒకే ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి టెస్టులు ఆడలేదు. ఈ నేపథ్యంలోనే తాను దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి తిరిగి భారత టెస్టు జట్టులో స్థానం దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు స్కై.

 నా ప్రస్తుత దృష్టి అంతా దానిపైనే..

‘టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడానికి ఎంతో మంది ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. నేను కూడా టెస్టు జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాను. అయితే భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత నాకు గాయమైంది. అనంతరం అవకాశాలు వచ్చిన ఆటగాళ్లు సత్తాచాటి రాణిస్తున్నారు. ఇప్పుడు అవకాశాలు రావడానికి వాళ్లే అర్హులు. ఇక నా ప్రస్తుత దృష్టి అంతా.. బుచ్చిబాబు టోర్నమెంట్(Bucchibabu Tournment), దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ఆడటమే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం సూర్య బుచ్చిబాబు టోర్నమెంట్‌లో ముంబై తరఫున ఆడుతున్నాడు. ముంబై జట్టులో సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్(Shreyas Ayyar), సర్ఫరాజ్ ఖాన్(Sarfraj Khan) వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఉన్నారు.

Related Posts

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

India Tour of England: వచ్చే నెల 6న ఇంగ్లండ్‌కు టీమ్ఇండియా?

ఇంగ్లండ్(England) గడ్డపై జరగబోయే కీలక టెస్ట్ సిరీస్(Test Series) కోసం BCCI ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. కొందరు ఆటగాళ్లను ముందుగానే అక్కడికి పంపుతోంది. ఈ మేరకు టీమ్ఇండియా(Team India) హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), కొందరు ఆటగాళ్లతో కూడిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *