టాక్స్ పేమెంట్​లోనూ ‘కింగ్’ విరాట్ కోహ్లీ.. ఎంత చెల్లించాడంటే?

ManaEnadu:టీమ్ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన మెరుగైన ఆటతో కింగ్ అనే బిరుదును సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే విరాట్ ఫ్యాన్స్ తనను ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. అయితే కేవలం ఆటలోనే కింగ్ కాదు.. ఫిట్​నెస్​, వ్యక్తిగత డిసిప్లెన్ వంటి చాలా అంశాల్లో కోహ్లీ తాను నంబర్ వన్ అని నిరూపించుకున్నాడు. ఇక తాజాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.66 కోట్ల పన్నును చెల్లించి క్రీడాకారుల్లోనే హైయ్యెస్ట్ టాక్స్ పేయర్​ (Tax Payer)గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇప్పటివరకూ క్రీడాకారులు కట్టిన ట్యాక్సుల్లో ఇదే అత్యధికం.

మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ (MS Dhoni) (రూ.38 కోట్లు), సచిన్ తెందూల్కర్‌ (Sachin Tendulkar) (రూ.28 కోట్లు), సౌరభ్‌ గంగూలీ (రూ.23 కోట్లు) హైయ్యెస్ట్ ట్యాక్స్​ కట్టారు. వారందరినీ నెట్టి విరాట్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. భారత జట్టు ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్య (Hardhik Pandya) గతంలో రూ.13 కోట్లు పన్నుగా చెల్లించారంటూ ప్రముఖ సంస్థ ఫార్చ్యున్‌ ఇండియా తాజాగా తమ నివేదికలో పేర్కొంది.

మరోవైపు ట్యాక్స్‌ పేమెంట్‌లో టీమ్ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan) అధిగమించాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ రూ. 66 కోట్లు ట్యాక్స్‌ కడితే.. షారుక్‌ ఏకంగా రూ.92 కోట్లు ట్యాక్స్‌ కట్టాడు. ఇక ఈ లిస్టులో విజయ్‌ రూ. 80 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ. 75 కోట్లు చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా (Fortune India) సంస్థ వెల్లడించింది.

భారతీయ సెలబ్రిటీలందరిలో రూ.92 కోట్లతో షారుక్‌ అత్యధికంగా పన్ను చెల్లించినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ లిస్టులో షారుక్ మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Thalapathy Vijay) (రూ.80 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌ (రూ.75 కోట్లు) బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (రూ.71 కోట్లు) చెల్లించారు. వారి తర్వాత రూ.66 కోట్లతో టీమ్ఇండియా స్టార్‌ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *