తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు.. ఇదిగో ఆధారాలు : ఆనం

ManaEnadu:YSRCP హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు (Animal Fat) ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బహిర్గతం చేశారు. ఈ నివేదికల్లో పొందుపర్చిన అంశాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) విడుదల చేశారు. జులై 8, 2024న ఈ లడ్డూలు, అందులో ఉపయోగించిన నెయ్యిని ల్యాబ్‌కు పంపించగా జులై 17న ఈ మేరకు ఎన్డీడీబీ సీఏఎల్‌ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చినట్లు ఆనం తెలిపారు.

ఆవు నెయ్యిలో సోయాబీన్ (Soya Bean), పొద్దు తిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతోపాటు చేప నూనె, బీఫ్ టాలో, పామాయిల్, పంది కొవ్వు (Pig Fat) కూడా ఇందులో వాడినట్లు నివేదికలో స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన NDDB CALF ల్యాబ్ ద్వారా వైఎస్సార్సీపీ బండారం బయటపడింది. నెయ్యి కొనుగోళ్లలో ఎటువంటి నాణ్యత పాటించలేదు ఈ విషయాన్ని ఈ నివేదిక ఆధారాలతో సహా నిరూపించింది. జగన్ సర్కార్ (Jagan Govt) భక్తుల నమ్మకంతో ఆటలాడుకుంది. వారి ఆరోగ్యంతో ఆటాడింది. 

నాణ్యమైన నెయ్యికి రూ.వెయ్యికి పైగా ఖర్చవుతుందని, జగన్ సర్కార్ రూ.320కి నెయ్యి టెండర్లు పిలిచింది. నలుగురికి నెయ్యి టెండర్‌ (Ghee Tender) కాంట్రాక్టు ఇచ్చారు. ఆవు నెయ్యి విషయంలో ల్యాబ్‌ సర్టిఫికేషన్‌ లేదు. నెయ్యి సర్టిఫికేషన్‌కు రూ.75 లక్షలతో ల్యాబ్‌ పెట్టే పరిస్థితిలో లేరా నెయ్యి విషయమై నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌లో పరీక్షలు చేసింది. అందులో చేప నూనె, పామాయిల్‌, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలు కలిపినట్లు తేలింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు నివేదికలో వెల్లడైంది. అని ఆనం వెల్లడించారు.

జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి తిరుమలలో లడ్డూలు (Tirumala Laddu) వాసన వస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని ఆనం తెలిపారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​కి చెందిన నందిని నెయ్యిని మార్చేశారని, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly)లో కూడా చర్చ జరిగిందని వెల్లడించారు. టీటీడీకి 75 లక్షల రూపాయలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? అని గత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Related Posts

KCR Health Update: కేసీఆర్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే?

తెలంగాణ(Telangana) మాజీ సీఎం, BRS పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం తీవ్ర అనారోగ్యానికి(Illness) గురైన సంగతి తెలిసిందే. ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడ యశోద ఆసుపత్రి(Somajiguda Yashoda Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా కేసీఆర్…

Edgbaston Test: శెభాష్ శుభ్‌మన్.. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌(Edgbaston, Birmingham) లో జరుగుతున్న ఇంగ్లండ్‌(England)తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సూపర్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో రోజు టీ విరామం(Tea Break) వరకు 265 నాటౌట్‌తో అజేయంగా నిలిచిన గిల్,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *