మన Enadu: బీఆర్ఎస్ అధినేతతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ తొలి మేయర్గా పనిచేశారు. ఉప్పల్ టిక్కెట్ ఆశించినా ఉద్యమ నేతగా తనను మరిచి మరో నాయకుడిగా టిక్కెట్ అవకాశం ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో బొంతు దంపతులు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు.
బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్నారని రాజకీయవర్గాలు భావించాయి. గ్రేటర్ హైదరాబాద్లో బీసీ సామాజిక వర్గంతోపాటు ఉద్యమనాయకుడిగా బొంతు రామ్మోహన్ బలమైన నేతగా ముద్ర వేసుకున్నారు. ఈక్రమంలోనే అటు బీఆర్ఎస్..ఇటు బీజేపీకి గట్టి పోట్టి ఇచ్చే వ్యక్తిగా బొంతుకే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపుతున్నారు.
ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానంపై ఘాటైన విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ నుంచి ఎంపీ(MP) టిక్కెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. దీంతో కేసీఆర్, కేటీఆర్పై స్వరం పెంచారు. బీఆర్ఎస్ గొంతు కోసిందని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా పదువలు కాదు..పరువులు తీసుకోలేమని ఓ మీడియా ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డికి టిక్కెట్ అధిష్టానం ప్రకటించింది. కిషన్ రెడ్డిపై పోటీకి బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడమే సరైన అభ్యర్థిగా పార్టీ పెద్దలు భావించారు. ఇప్పటికీ బొంతు పేరును డిల్లీ అధిష్టానానికి పంపించారు. డిల్లీ పెద్దలు బొంతు రామ్మోహన్కు సికింద్రాబాద్ నుంచి బరిలో దింపాలని నిర్ణయం తీసుకుంది.
మల్కాజిగిరి నుంచి చంద్రశేఖర్ , సికింద్రాబాద్ నుంచి బోంతు రామ్మోహన్, నల్గొండ నుంచి రఘువీర్రెడ్డి, నిజమాబాద్ నుంచి జీవన్రెడ్డి, భవనగిరి నుంచి కిరణ్ కుమార్రెడ్డి పేర్లు ఖారారు అయినట్లు సమాచారం. రేపు అధికారికంగా పేర్లును కాంగ్రెస్ పెద్దలు ప్రకటించబోతున్నారు.