Crime News: కమ్మల కోసం.. భర్తనే తగలబెట్టింది ఓ భార్య..!

కమ్మలు కొనలేదని కోపంతో భర్త షేక్‌ యాకూబ్‌ పాషాకు భార్య సమీనా నిప్పంటించింది. చెవి కమ్మలు కొనివ్వాలని భర్తను తరచూ వేధించేదని తెలుస్తోంది. తన దగ్గర డబ్బు లేదని, పాషా తేల్చి చెప్పడంతో క్షణికావేశానికి లోనైన భార్య టర్పెంటాయిల్‌ పోసి తగలబెట్టింది.

Khammam: పతియే ప్రత్యక్ష దైవం అన్న రోజులు పోయాయి. నువ్వేంత అంటే నువ్వేంత అంటున్నారు ఈ కాలం భార్య భర్తలు. అంతేకాదు ఇష్టమైనవి కొనిస్తే ఓకే.. లేదంటే వేధింపులకు కూడా వెనకడుగు వేయడం లేదు. క్షణికావేశంతో ఎంతటి దారుణానికి తెగబడుతున్నారో కూడా ఆలోచించడం లేదు. తాజాగా, కట్టుకున్న భర్తపై ఓ భార్య తెగించేసింది. తాను అడిగిన చెవి కమ్మలు కొనివ్వలేదని భర్తకు ఏకంగా నిప్పంటించింది. ఈ దారుణమైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.


స్థానికుల సమాచారం ప్రకారం.. ఖమ్మం జిల్లా నగరంలోని నిజాంపేటలో నివసించే షేక్‌ యాకూబ్‌ పాషా, సమీనా అనే దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. అయితే, గత కొద్ది కాలంగా తనకు చెవిదుద్దులు కొనివ్వాలంటూ భార్య సమీనా నిత్యం భర్తను వేధించేదని తెలుస్తోంది. ఈ విషయంపై గత శనివారం సాయంత్రం వీరిద్దరి మధ్య కొట్లాట జరిగింది. తన వద్ద అంత డబ్బు లేదని..కమ్మలు కొనివ్వలేనని భర్త పాషా భార్యకు తేల్చిచెప్పడు.. అంతే, తీవ్ర ఆగ్రహానికి లోనైనా భార్య సమీనా తన భర్తపై పెయింట్లకు సంబంధించిన టర్పెంటాయిల్‌ పోసి నిప్పంటించింది.

ఈ ఘటనలో యాకూబ్‌ పాషా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక బంధువులు వెంటనే అప్రమత్తమై అతడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేకపోయిన పాషా తల్లి.. కొడలు సమీనాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు.

Share post:

లేటెస్ట్