టెట్ ఫ‌లితాలు తెలిసేది ఆరోజే

తెలంగాణ‌: ఈ నెల 27న ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్‌) ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం టెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా… పేప‌ర్‌-1కు 2,26,744 మంది, పేప‌ర్‌-2కు 1,89,963 మంది హాజ‌ర‌య్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రైమ‌రీ కీ విడుద‌ల చేసేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ కీపై అభ్య‌ర్థుల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించిన అనంత‌రం తుది కీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా సిరిసిల్లా జిల్లాలో ఓ సెంట‌ర్‌లో ఓఎంఆర్ షీట్ల‌పై అభ్య‌ర్థులు వైట్‌న‌ర్ ఉప‌యోగించ‌గా వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని.. అభ్య‌ర్థులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప‌లు కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణలో జ‌రిగిన త‌ప్పిదాల‌పై అభ్య‌ర్థులు మండిప‌డుతున్నారు.

  • Related Posts

    Employement: ఒకేషనల్ కోర్సులతో ఉపాధి!

    Mana Enadu:పదో తరగతి తర్వాత త్వరగా స్థిరపడాలనుకుంటే ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులు చేయడం మంచి ఆప్షన్. చదువు పూర్తయిన వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంది. ఒకేషనల్ కోర్సుల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ఎలాంటి శిక్షణ…

    IBPS: బ్యాంకుల్లో 5291 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

    Mana Enadu: ట్రైనీఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) కింద స్పెషలిస్ట్ ఆఫీసర్ (CRP SPL-XIV)/మేనేజ్‌మెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4455 ఖాళీలను భర్తీ చేయనున్నారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *