టెట్ ఫ‌లితాలు తెలిసేది ఆరోజే

తెలంగాణ‌: ఈ నెల 27న ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్‌) ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్ర‌వారం టెట్ ప‌రీక్ష నిర్వ‌హించ‌గా… పేప‌ర్‌-1కు 2,26,744 మంది, పేప‌ర్‌-2కు 1,89,963 మంది హాజ‌ర‌య్యారు. ఈ నెల 19, 20 తేదీల్లో ప్రైమ‌రీ కీ విడుద‌ల చేసేందుకు అధికారులు స‌న్నాహాలు చేస్తున్నారు. ఆ కీపై అభ్య‌ర్థుల నుంచి అభ్యంత‌రాలు స్వీక‌రించిన అనంత‌రం తుది కీని విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా సిరిసిల్లా జిల్లాలో ఓ సెంట‌ర్‌లో ఓఎంఆర్ షీట్ల‌పై అభ్య‌ర్థులు వైట్‌న‌ర్ ఉప‌యోగించ‌గా వాటిని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని.. అభ్య‌ర్థులు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు. ప‌లు కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణలో జ‌రిగిన త‌ప్పిదాల‌పై అభ్య‌ర్థులు మండిప‌డుతున్నారు.

  • Related Posts

    Metamind Academy: నీట్ యూజీ కౌన్సెలింగ్‌పై ‘మెటామైండ్’ ఫ్రీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్.. ఎక్కడో తెలుసా?

    NEET UGలో ఉత్తీర్ణత సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఈ పరీక్ష చాలా టఫ్‌గా ఉంటుంది. అయినా కూడా డాక్టర్ అవ్వాలన్న సంకల్పంతో విద్యార్థులు కష్టపడి చదివి.. నీట్ పరీక్ష పాస్ అవుతారు. డాక్టర్ కావడానికి నీట్‌ పాసవడం మొదటి…

    Jobs: డిగ్రీ పాసైన వారికి అదిరే గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండా నాబార్డులో జాబ్స్

    నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)( NABARD) స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *