
టాలీవుడ్ యంగ్ హీరో సుగీ విజయ్, మౌనిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రా రాజా (Raa Raja)’. బి. శివప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇీవలే రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రిలీజ్ చేశారు. మార్చి 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాను ముఖాలు చూపించకుండా తెరకెక్కిస్తూ కొత్త ప్రయోగం చేశారు మేకర్స్. ‘రా రాజా ’చిత్రానికి బూర్లే హరి ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, కిట్టు లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.
రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రా రాజా మూవీ టైటిల్ను గమనిస్తే ఏదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో ఓ ముఖం కూడా కనిపించదు. అసలు మొహాలు చూపించకుండా సినిమా తీసి దర్శకుడు శివ ప్రసాద్ ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలోనూ మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ట్రీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్లతో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు, ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. అని తమ్మారెడ్డి అన్నారు.
‘మా ట్రైలర్ను చూసి, రిలీజ్ డేట్ పోస్టర్ను రిలీజ్ చేసి, అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి థాంక్స్. మా చిత్రంలో ఆర్టిసుల మొహాలు కనిపించవు. కథ, కథనమే ముఖ్యం అని మేం ఈ మూవీని తీశాం. ఇది ఒక ప్రయోగం. మా ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని డైరెక్టర్ శివప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు.
కావాలనే కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు: Pooja Hegde
సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్…