‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్.. అప్డేట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్

‘స్టీవ్.. చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో.. మనం కూడా మన గుడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగితేలాల్సిందే’.. ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా నీలో.. అబ్బ కమల్ హాసన్’… ఈ డైలాగ్స్ వింటే మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో అర్థమైపోయి ఉంటుంది కదా. అదేనండి.. ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi)’ మూవీ గురించి. 2018లో తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్

ఈ సినిమాలో విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమఠం, సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కామియో రోల్ చేశాడు.  సోషల్ మీడియాలో మీమ్స్ వల్ల యూత్​కు ఈ సినిమా బాగా ఎక్కేసింది. ఇటీవల రీ రీలిజ్​కు విపరీతమైన క్రేజ్ దక్కింది. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ తరుణ్ భాస్కర్ గతంలో చెప్పారు. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తరుణ్ భాస్కర్​ ఇన్​స్టా స్క్రీన్​షాట్

ఈ ఏడాది బాకీలు తీర్చాలి

తాజాగా ఈ సినిమాపై తరుణ్ భాస్కర్ (Tharun Bhascker Dhaassyam) ఓ అప్డేట్ ఇచ్చారు. తన ఇన్​స్టాగ్రామ్​లో ఆయన ఓ సాలిడ్ అప్డేట్ షేర్ చేశారు. ‘ఈ’ అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ ‘ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలి’ అని స్టోరీలో పెట్టారు. దీంతో ఆయన ‘ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindhi 2 update)’ సినిమా సీక్వెల్ గురించే మాట్లాడారంటూ నెటిజన్లు సంబుర పడుతున్నారు.  సీక్వెల్ పనులు ఈ ఏడాదే వస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై తరుణ్ భాస్కర్ అధికారిక ప్రకటన చేసే వరకు క్లారిటీ రాదు. నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్​ చుట్టూ తిరిగే కథను డైరెక్టర్ తరణ్ తక్కువ బడ్జెట్​లో అద్భుతంగా తెరకెక్కించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *