
కేథలిక్లో పవిత్ర గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఇటలీకాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ(Vatican City) ప్రకటించింది. ఈనెల 21న మరణించిన పోప్ అంత్యక్రియల(Pope Francis Funeral)కు ప్రపంచ దేశాల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 164 మంది హాజరుకానున్నారు. ఇప్పటికే భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) రోమ్కు చేరుకున్నారు. అలాగే US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, UK ప్రధాని కెయిర్ స్టార్మర్తోపాటు ఫ్రాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షులు మెక్రాన్, జెలెన్స్కీ తదితరులు ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు.
First official image of the Body of Pope Francis lying in state at the chapel of Santa Martha at Vatican City.
Following Pope Francis’ request, his body is placed inside a wooden casket instead of a bier, which was used for the funeral of the previous popes. pic.twitter.com/CYMwozhd9H
— Sardar Zahid Ali Sipra (@zahidsipra786) April 26, 2025
9 రోజులపాటు సంతాపదినాలు
కాగా గత 3 రోజులుగా పోప్ పార్థివదేహాన్ని(The Pope’s body) దాదాపు 2.50లక్షల మందికిపైగా ప్రజలు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రస్తుతం 9 రోజులపాటు సంతాపదినాలు(Mourning) పాటిస్తున్నారు. వీటిని నవెండియలెస్ (Novendiales) అంటారు. సాధారణంగా పోప్ అంత్యక్రియలు, ఖననం ప్రక్రియ మృతి చెందిన నాటినుంచి నాలుగు నుంచి ఆరో రోజు మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం అంత్యక్రియల రోజుగా నిర్ణయించారు. పోప్ భౌతికకాయం ఫొటోలను కూడా తొలిసారి వాటికన్ విడుదల చేసింది. ఈ మేరకు ఇటలీ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.