Pune Highway: ఓటీటీలో దుమ్మురేపుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘పుణే హైవే’

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్లు .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల(Investigative thrillers)కు OTTలలో ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అదే విషయాన్ని ‘పుణే హైవే(Pune Highway)’ సినిమా మరోసారి నిరూపిస్తోంది. భార్గవ కృష్ణ – రాహుల్(Bhargava Krishna-Rahul) దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23వ తేదీన థియేటర్లలో విడుదలైంది. థియేటర్ల వైపు నుంచి ఫరవాలేదని అనిపించుకున్న ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి ‘నెట్ ఫ్లిక్స్(Netflix)’లో దూసుకుపోతోంది. అమిత్ సాద్, జిమ్ సరబ్, అనువాబ్ పాలా & మంజరి ఫడ్నిస్ కీలక పాత్రల్లో నటించారు.

EXCLUSIVE: Amit Sadh, Jim Sarbh react to Anurag Kashyap’s Netflix criticism: “No point complaining…believe in your project”; Amit confesses he was MOCKED for doing OTT before it became cool

కథేంటంటే..

ముంబై(Mumbai)కి చాలా దూరంలోని ఒక చెరువులో ఒక యువతి మృత దేహం లభిస్తుంది. ఆమె పేరు మోనా(Mona) అని విచారణలో తేలుతుంది. అయితే అది హత్యనా .. ఆత్మహత్యనా అనేది తేల్చడానికి CI ప్రభాకర్ రంగంలోకి దిగుతాడు. అతని ఇన్వెస్టిగేషన్(Investigation) ఒక నలుగురు వ్యక్తుల దగ్గర ఆగుతుంది. ఆ నలుగురు కూడా మంచి స్నేహితులు. మోన హత్య కేసులో వాళ్లను ఆ పోలీస్ ఆఫీసర్ అనుమానిస్తాడు. ఆ నలుగురు స్నేహితులకు నిజంగానే మోనాతో సంబంధం ఉంటుందా? వాళ్లే ఆమెను హత్య చేశారా? మోనా హత్య ఆ నలుగురి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది మిగతా కథ. ఇలా అనూహ్యమైన మలుపులతో ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. అందువల్లనే థ్రిల్లర్ జోనర్(Thriller genre) సినిమాలను ఇష్టపడేవారు నుంచి ఈ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం హిందీ(Hindi) ఆడియోలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర భాషలలోకి రానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *