
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ (గురువారం) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు 13 కంపార్ట్మెంట్ల(Compartments)లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(బుధవారం) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 70,372 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.4.25 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం
కాగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు స్వామివారి చెంతకు వస్తుంటారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల చేరుకుని.. భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు.