వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైస్సార్సీపీ కీలక నేత వల్లభనేని వంశీ (vallabhaneni vamsi)కి బిగ్ షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీని మూడ్రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. వెన్ను నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్నానంటూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందిస్తూ.. వంశీకి బెడ్, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని జైలు అధికారులను ఆదేశించింది.

విజయవాడ పరిధిలో విచారణ

వంశీని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు పోలీసులకు సూచనలు జారీ చేసింది. ఈ మూడ్రోజుల పాటు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కచ్చితంగా అతడికి మెడికల్ టెస్టులు చేయాలని చెప్పింది. విజయవాడ పరిధిలోనే కస్టడీ (Police Custody)లోకి తీసుకుని విచారణ చేయాలని ఆదేశించింది. న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ కొనసాగించాలని పేర్కొనింది. మరోవైపు సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతో పాటు అరెస్టైన ఏ7, ఏ8 ఇద్దరినీ కూడా విచారించడానికి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *