తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలే టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Elections) షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.

మార్చి 29వ తేదీ నాటికి ఏపీలో యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, పి.అశోక్‌ బాబు, తిరుమల నాయుడు, దువ్వారపు రామారావు పదవీ కాలం ముగియనుంది. ఇక తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి రాఠోడ్‌, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హాసన్‌ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ: మార్చి 3

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: మార్చి 10

నామినేషన్ల పరిశీలన: మార్చి 11

నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13

పోలింగ్‌: మార్చి 20 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

ఓట్ల లెక్కింపు: మార్చి 20 (పోలింగ్‌ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి)

Related Posts

తెలంగాణలో పొలిటికల్ టెన్షన్.. మంత్రి పదవిపై ఆశావహుల ఆశ!

తెలంగాణ(Telangana)లో మంత్రివర్గ విస్తరణ(Cabinet expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి CM రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ మేరకు ఉగాది తర్వాత కొత్త మంత్రుల ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈమేరకు ఏప్రిల్…

బెట్టింగ్ యాప్స్ కేసు.. సెలబ్రిటీలకు బిగ్ షాక్

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ (Online Betting Apps) వల్ల ఎంతో మంది యువతీ యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. వీటికి బానిసై చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. అప్పుల పాలై చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ఈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *