ఇవాళ అర్ధరాత్రితో వైకుంఠద్వార దర్శనం సమాప్తం

తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikuntha Dwara Darshanam) ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పది రోజులపాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.82 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసిన విషయం తెలిసిందే.

రేపటి నుంచి సర్వదర్శనం

శుక్రవారం రోజున 61,142 మంది భక్తులు (Tirumala Rush) దర్శించుకోగా రూ.3.15 కోట్ల హుండీ కానుకలు లభించాయి. శనివారం సాయంత్రానికి సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులంతా నారాయణగిరి షెడ్లలో దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం నుంచి భక్తులకు సర్వదర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *