మెగా అభిమానులకి బ్యాడ్ న్యూస్.. ‘జరగండి’ పోస్ట్ పోన్

‘-By Nitya

మన ఈనాడు:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( RamCharan)- శంకర్( Shankar)కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ‘జరగండి’ అనే ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ టీం ప్రకటించింది. ఇందుకు సంబంధించి పోస్టర్ ని కూడా విడుదల చేసింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సాంగ్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. ఈ సాంగ్ కి సంబంధించిన వర్క్ పూర్తి కాకపోవడంతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అయితే, సోషల్ మీడియాలో ఈ పాటకి సంబంధించి ట్యూన్లు, లిరిక్స్ లీక్ అయ్యాయి. దీనిపై ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ నెగెటివిటీని పరిగణలోకి తీసుకున్న మూవీ టీం సింగర్ ని మార్చి ఈ పాటని రీ రికార్డింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాకి తమన్( Thaman) మ్యూజిక్ అందిస్తున్నారు. కియారా అద్వానీ( Kiara Advani) కథానాయిక. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది దసరాకి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *