ట్రంప్ విలీన బెదిరింపులు.. కెనడాలో ముందస్తు ఎన్నికలకు పిలుపు

అమెరికా(USA).. కెనడా(Canada) మధ్య ట్రేడ్ వార్(Trade War) నడుస్తోంది. మరోవైపు కెనడా తమ దేశంలో విలీనం కావాలంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(Trump) బెదిరింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Canadian Prime Minister Mark Carney) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫుల్ మెజార్టీ కోసం ముందస్తు ఎలక్షన్ల(Elections)కు పిలుపునిచ్చాడు. దీంతో కెనడాలో వచ్చే నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారి లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా(LPC)… ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ కెనడా(CPC)తో తలపడనుంది.

బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే..

కాగా కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో(Justin Trudeau) వైదొలిగిన తర్వాత.. ప్రధానమంత్రి బాధ్యతలను ఆర్థిక నిపుణుడైన మార్క్ కార్నీ (60) మార్చి 14న బాధ్యతలు చేపట్టారు. అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ట్రంప్(trump) విధానాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రస్తుతం కెనడాలో లిబరల్ పార్టీకి మెజార్టీ ఉన్నా.. బలమైన ప్రభుత్వం ఏర్పాటు దిశగా కార్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Mark Carney Will Be Canada's Next Prime Minister. Here's What to Know. -  The New York Times

51వ రాష్ట్రంగా మారుస్తా: ట్రంప్

మరోవైపు పొరుగున ఉన్న కెనడాను అమెరికా(USA)లో 51వ రాష్ట్రంగా మారుస్తానని ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని మార్క్ కార్నీ ఈ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పటికే పార్లమెంట్‌ను రద్దు చేసిన కార్నీ.. ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ జనరల్‌ను అభ్యర్థించారు. ట్రంప్ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *