Kannappa: తెలుగు సినిమాకు గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో ‘కన్నప్ప’ మూవీ ప్రత్యేక ప్రదర్శన

తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. మంచు విష్ణు(Manchu Vishnu) హీరోగా, మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మించిన భక్తిరస చిత్రం ‘కన్నప్ప(Kannappa)’. ఈ మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan in Delhi)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. శివ భక్తుడైన తిన్నడు జీవిత కథ ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్(Director Mukesh Kumar Singh) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, జూన్ 27న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ మూవీని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించగా, దీనికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Kannappa: 2025 Telugu Historical Drama Film, Trailer, Review, Songs – Kids  Portal For Parents

మాటల్లో చెప్పలేని గౌరవం దక్కింది..

‘కన్నప్ప’ చిత్రం భక్తి, సాంస్కృతిక ప్రాముఖ్యతతో పాటు సినీ నైపుణ్యాన్ని సమన్వయం చేసిందని, మంచు విష్ణు నటన అద్భుతమని అధికారులు కొనియాడారు. ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్(Akshay Kumar), కాజల్ (శివపార్వతులు), మోహన్ లాల్ (కిరాతుడు) వంటి తారాగణం ఈ చిత్రానికి మరింత ఆకర్షణను జోడించింది. కాగా రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఎపిక్ మూవీ, దృశ్య వైభవంతో పాటు భావోద్వేగ లోతును ప్రదర్శించింది. ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది. చిత్ర బృందం సోషల్ మీడియా(SM) వేదికగా ఈ గౌరవాన్ని అభిమానులతో పంచుకుంది. “మాటల్లో చెప్పలేని గౌరవం దక్కింది” అని మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేసింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *