India vs Pak: బోర్డర్‌లో టెన్షన్ టెన్షన్.. యుద్ధం తప్పదా?

పహల్గాం ఉగ్రదాడి(Pahalgam terror attack) తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ(War between India and Pakistan) వాతావారణం నెలకొంది. ఇరు దేశాల కదలికలు చూస్తుంటే ఏ క్షణమైనా యుద్ధం మొదలు కావచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల(All State)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు సంసిద్ధతను అంచనా వేయడానికి బుధవారం(మే 7) అన్ని రాష్ట్రాలు భద్రతా మాక్ డ్రిల్(Safety mock drill) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ(Central Home Ministry) ఆదేశించింది. ఈ మాక్ డ్రిల్‎లో భాగంగా వైమానికి దాడులు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది.

Protect the LoC as it has, ironically, preserved common political space  between India, Pakistan | The Indian Express

 

1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి

వైమానికి దాడుల(Air strikes) హెచ్చరిక సైరన్ల పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ప్రతి స్పందించాలో తెలపాలని.. స్వీయ రక్షణపై పౌరులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. 1971 పాక్ యుద్ధం(1971 India-Pakistan War) తర్వాత కేంద్రం అన్ని రాష్ట్రాలను భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించడం ఇదే ఫస్ట్ టైమ్. మళ్లీ భారత్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టడంతో పాక్‎తో వార్ షురూ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు దాడిలో 26 మంది పర్యాటకులు బలైన విషయం తెలిసిందే.

Related Posts

Racist Attack on Indian Girl: భారత సంతతి బాలికపై ఐర్లాండ్‌లో అమానుష ఘటన

ఐర్లాండ్‌(Ireland)లో అత్యంత అమానుష రీతిలో జాత్యాహంకార దాడి(Racist attack) జరిగింది. ఇక్కడి వాటర్‌ఫోర్డ్‌లో ఆరేండ్ల భారతీయ సంతతి బాలిక(Indian origin Girl) తన ఇంటి ముందు ఆటుకుంటూ ఉండగా కొందరు అబ్బాయిలు సైకిళ్లపై వచ్చి దాడి జరిపారు. తిట్లకు దిగి, ఐర్లాండ్…

Nitish Kumar: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలిస్తాం.. సీఎం కీలక ప్రకటన

అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) సమీపిస్తుండటంతో బిహార్(Bihar) సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగులే టార్గెట్‌గా ప్రచారం చేపట్టారు. ఈ మేరకు యువతను ఆకట్టుకునేందుకు X వేదికగా కీలక ప్రకటన చేశారు. 2025-2030…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *