Delhi CM: ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం కోసం పనిచేస్తా: రేఖా గుప్తా

బీజేపీ అధిష్ఠానం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని దేశరాధానిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా(Rekha Gupta) పేర్కొన్నారు. ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెను ప్రకటించిన అనంతరం ఆమె స్పందించారు. కాగా. తొలిసారి షాలిమార్‌బాగ్(Shalimarbagh) నుంచి MLAగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా CM కానున్నారు. గతంలో BJP నుంచి సుష్మా స్వరాజ్(Sushma Swaraj), కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్(Sheila Deekshit, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశీ(Athishi) ముఖ్యమంత్రులుగా పని చేశారు. కాగా తనను CMగా ఎంపిక చేసిన అగ్రనాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెడతా: రేఖా గుప్తా

తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్ఠానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. అధిష్ఠానం నమ్మకం, మద్దతు తనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయని రాసుకొచ్చారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా రేఖా గుప్తాకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నాయకురాలు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ అభినందనలు తెలిపారు.

ఈ మధ్యాహ్నాం 12.35 గంటలకు ప్రమాణం

కాగా ఇవాళ సీఎంగా రేఖా గుప్తా సహా 6 మంత్రులతో ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ మధ్యాహ్నం 12.35గంటలకు సీఎంగా రేఖాగా గుప్తా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకు రామ్‌లీలా మైదానంలో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), అమిత్ షా, BJP అగ్రనేతలు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, NDA ముఖ్య నాయకులు హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుక కోసం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *