WT20WC-2024: నేటి నుంచే ఉమెన్స్ టీ20 ప్రపంచకప్.. భారత్ మ్యాచ్ ఎప్పుడంటే!

ManaEnadu: అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో పొట్టి క్రికెట్ సమరం నేడు ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్(WT20WC-2024) జరగనుంది. ఈ టోర్నీ అక్టోబర్ 20 వరకు కొనసాగనుంది. తొలి మ్యాచులో బంగ్లాదేశ్(BAN), స్కాంట్లాండ్(SCO) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు షార్జా వేదికగా జరగనుంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ఇదే వేదికపై శ్రీలంక, పాకిస్థాన్ జట్లు పోటీపడనున్నాయి. కాగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా టీమ్ఇండియా(Team India) జర్నీ రేపు ప్రారంభంకానుంది. న్యూజిలాండ్‌తో హర్మన్ ప్రీత్ కౌర్(Harman Preet Kaur) సేన తన తొలి మ్యాచ్ ఆడనుంది. రేపు దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

10 జట్లు రెండు గ్రూపులుగా

కాగా ఈ టోర్నీలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌-Aలో భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. గ్రూప్-Bలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాంట్లాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. ఈ వరల్డ్ కప్‌లో భాగంగా 23 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతి గ్రూప్‌లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన టీమ్స్ సెమీస్ (Semi Final)కు చేరుకుంటాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు అక్టోబర్ 20న ఫైనల్లో తలపడతాయి. కాగా టీ20 వరల్డ్ కప్ ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉంది. కానీ అక్కడ రాజకీయ అల్లర్ల(Political riots) కారణంగా యూఏఈలో నిర్వహిస్తున్నారు.

 భారత్ షెడ్యూల్ ఇదే..

భారత్ అక్టోబర్ 4న న్యూజిలాండ్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌(Pakistan)ను అక్టోబర్ 6న దుబాయ్‌లో ఢీకొంటుంది. అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీఫైనల్స్ జరుగుతాయి. మొత్తం మ్యాచులను దుబాయ్, షార్జా(Dubai, Sharjah) వేదికగా నిర్వహించనున్నారు. కాగా 2020లో భారత్ రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆసీస్ ఈ టోర్నీలో ఏకంగా ఎనిమిసార్లు  ఛాంపియన్‌గా నిలిచింది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *