YS Jagan: చంద్రబాబు తిరుమల పవిత్రతను మంటగలిపారు: జగన్

Mana Enadu: తిరుమల(Tirumala Tirupati Devasthanam) పవిత్రతను, స్వామి వారి ప్రసాదం విశిష్టతను CM చంద్రబాబు నిజంగా రాజకీయ దుర్బుద్ధితో(With political deception)నే మంటగలిపారని మాజీ సీఎం, YCP అధినేత జగన్ విమర్శించారు. లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపించడం ద్వారా చంద్రబాబుకు కోర్టు(Courts)లు సైతం మొట్టికాయలు వేశాయని అన్నారు. కోట్లాది భక్తుల(Crores of devotees) మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న TTD EOనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూ(Laddoos)లపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు.

 ఇన్ని ఆధారాలు కనిపించడం లేదా..

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో, గొప్పో సిగ్గుపడతారని దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం, భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు(Chandr ఎలాంటివాడంటే… పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పు నేపథ్యంలో జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తిచూపిందని అన్నారు.

 అసలు సనాతన ధర్మం అంటే పవన్‌కు తెలుసా?: జగన్

ఇప్పటికీ TDP తన సోషల్ మీడియా(Social Media)లో దుష్ప్రచారం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ‘నాకు ధర్మారెడ్డి బావ అంట… కరుణాకర్ రెడ్డి మామ అంట…TDP ట్వీట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సుప్రీంకోర్టు చంద్రబాబు మీద అక్షింతలు వేస్తే… జగన్ పాపం పండిందని, జగన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అని ట్వీట్ చేశారు. అబద్ధాలు చెప్పడానికి మనుషులు ఏ స్థాయికి దిగజారుతారో అనిపిస్తుంది. మనిషన్నాక దేవుడంటే భయం, భక్తి ఉండాలి… చంద్రబాబును సుప్రీంకోర్టు(Supreme Court) ఆక్షేపించిందన్న విషయాన్ని జాతీయ మీడియా(National Meadia) మొత్తం కథనాలు ఇచ్చింది… అందరూ ఈ విధంగా చంద్రబాబును తిడుతున్నా గానీ… TDP సోషల్ మీడియా దాన్ని కూడా వక్రీకరిస్తోంది’ అని జగన్ మండిపడ్డారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పైనా జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అసలు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా?’ అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ జగన్ ప్రశ్నించారు.

Related Posts

Parliament: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్రం అనాసక్తి 

ఆపరేషన్ సింధూర్ తర్వాత పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశం నిర్వహించడానికి కేంద్రం అనాసక్తి చూపుతున్నట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాబోయే…

West Indies cricket team: ఒలింపిక్స్ లో వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు అవకాశం ఛాన్స్ దక్కేనా? 

లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్ గేమ్స్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనే దానిపై క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఐసీసీని స్పష్టత కోరుతోంది. సాధారణంగా, వెస్టిండీస్ క్రికెట్ లో 15 దేశాలు లేదా ప్రాంతాల సమాహారంగా ఉంటుంది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *